రోడ్ మ్యాప్ ప్రకటించాలి

ఆంధ్రప్రదేశ్ లోని నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆల్ మట్టి నీటిని కర్ణాటక వాడుకుంటున్నా జగన్ [more]

Update: 2021-04-13 01:36 GMT

ఆంధ్రప్రదేశ్ లోని నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆల్ మట్టి నీటిని కర్ణాటక వాడుకుంటున్నా జగన్ ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. శ్రీశైలానికి కూడా నీళ్లు రాని పరిస్థితి ఉందని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పై తీసుకున్న చర్యలపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సీమ ప్రాజెక్టులపై రోడ్ మ్యాప్ ను ప్రకటించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News