నేడు వాసాలమర్రికి మరోసారి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత [more]

Update: 2021-08-04 03:37 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తొలిసారి జూన్ 22వ తేదీన కేసీఆర్ పర్యటించారు. గ్రామ అభివృద్ధికి కొన్ని సూచనలు చేశారు. ఇప్పడు మరోసారి ఆ గ్రామాన్ని పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలపై కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. వాసాలమర్రి గ్రామ వీధుల్లో తొలుత పర్యటించిన అనంతరం కేసీఆర్ ఎంపిక చేసిన 130 మంది గ్రామస్థులతో సమావేశమై గ్రామ అభివృద్ధిపై సమీక్ష చేయనున్నారు.

Tags:    

Similar News