బ్రేకింగ్ : ఏపీపై కస్సుమన్న కేసీఆర్

ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తాను ఏపీ ప్రభుత్వానికి స్నేహ హస్తం అందించినా వారు కాలుదువ్వుతున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలను [more]

Update: 2020-08-10 14:23 GMT

ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తాను ఏపీ ప్రభుత్వానికి స్నేహ హస్తం అందించినా వారు కాలుదువ్వుతున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని కేసీఆర్ అన్నారు. తాను స్వయంగా ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి మాట్లాడతానని కేసీఆర్ చెప్పారు. త్వరలో జరిగే అపెక్స్ కమిటీ సమావేశంలో వాదనలను సమర్థవంతంగా వినిపిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నోరుమూయిస్తామని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై నాటకాలాడుతుందన్నారు.

Tags:    

Similar News