వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్రలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీలో చేరారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ ఛైర్మన్ రామకృష్ణతో పాటు మరికొందరు టీడీపీ నేతలకు జగన్ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.