టీడీపీ నేతలపై జేసీ ఫైర్… సమావేశంలో టెన్షన్

తెలుగుదేశం పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముందు కార్యకర్తలను కాపాడాలని ఆయన కోరారు. అనంతపురంలో రాయలసీమకు చెందిన టీడీపీ నేతల [more]

Update: 2021-09-11 07:39 GMT

తెలుగుదేశం పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముందు కార్యకర్తలను కాపాడాలని ఆయన కోరారు. అనంతపురంలో రాయలసీమకు చెందిన టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. రాయలసీమకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుందని, ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని టీడీపీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ప్రాజెక్టుల సంగతి తర్వాత..ముందు కార్యకర్తలను కాపాడుకోవడమెలా? అన్నదాని పై దృష్టి సారించాలని కోరారు. అంతేకాదు కొందరి నేతల కనుసన్నల్లోనే సమావేశాలు జరగడమేంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.

Tags:    

Similar News