జగన్ నన్ను టార్గెట్ చేయలేదు

జగన్ తనను టార్గెట్ చేయలేదని, జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే తనను లక్ష్యంగా చేసుకున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తన బస్సులను సీజ్ చేయడంలో [more]

Update: 2019-11-18 04:10 GMT

జగన్ తనను టార్గెట్ చేయలేదని, జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే తనను లక్ష్యంగా చేసుకున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తన బస్సులను సీజ్ చేయడంలో కూడా జగన్ ఆదేశాలు ఉండకపోవచ్చని తాను భావిస్తున్నానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆయన ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంత్రి పదవు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆయనంటే తనకు గౌరవమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఆప్యాయత, అనురాగం ఉండేవన్నారు. జగన్ ఇప్పటికీ, ఎప్పటికీ మావాడేనని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికీ చంద్రబాబు తమ నాయకుడే అని అన్నారు. తాను టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఊహించలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు మీద మొహం మొత్తి, జగన్ నవరత్నాల వల్లనే వైసీపీ విజయం సాధించిందన్నారు. తాను మోదీని పొగిడినంత మాత్రాన బీజేపీలో చేరినట్లు కాదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News