బ్రేకింగ్ : జేసీ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి టీడీపీపైనే?

మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని జేసీ దివాకర్ రెడ్డి [more]

Update: 2020-05-21 07:47 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇంట్లో ఉండి దీక్ష చేస్తే జగన్ స్పందిస్తారా? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో 158 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే స్పందించారా? అని జేసీ అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పై జగన్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నాని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. రాక్షస రాజ్యంలో ఇంతకన్నా ఏం చూస్తామని వైసీపీని కూడా విమర్శించారు. వాళ్లదే రాజ్యం కాబట్టి వైసీపీ వాళ్లు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే తల బాగుండి, కాళ్లు, చేతులకు పక్షవాతం వచ్చినట్లు ఉందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News