వేవ్ కాదు.. వీపులు పగలగొడుతుంటే ఏకగ్రీవాలయ్యాయి

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ కు [more]

Update: 2020-03-16 08:06 GMT

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ కు కులం అంటగట్టడమేంటని ప్రశ్నించారు. అలాగంటే సీఎం జగన్ సామాజికవర్గానికి చెందిన అధికారులు అన్ని చోట్లా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సామాన్యులు ఎవరూ మాట్లాడకూడదని చెప్పారు. న్యాయస్థానాలు తేలుస్తాయన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు ప్రత్యర్థి పార్టీల వీపులు పగులకొట్టడం వల్లనే జరిగాయని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News