అయ్యన్న కు మతిలేదు.. బుద్దాకు బుద్దిలేదు

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై ఏపీ మంత్రి జయరాం మండిపడ్డారు. బెంజి కారు తాను తీసుకుని ఉంటే ఆ కేసులో కార్తీక్ నిందితుడిగా ఎలా ఉంటాడని మంత్రి [more]

Update: 2020-09-19 07:14 GMT

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై ఏపీ మంత్రి జయరాం మండిపడ్డారు. బెంజి కారు తాను తీసుకుని ఉంటే ఆ కేసులో కార్తీక్ నిందితుడిగా ఎలా ఉంటాడని మంత్రి జయరాం ప్రశ్నించారు. 2019 డిసెంబరులో తన కుమారుడికి బెంజి కారు ఇచ్చారని చెబుతున్న అయ్యన్న పాత్రుడు, మొన్న నమోదయిన కేసులో కార్తీక్ ఎలా ఉంటాడని అని అన్నారు. అయ్యన్న పాత్రుడికి మతిభ్రమించిందన్న మంత్ర జయరాం బుద్దా వెంకన్నకు బుద్ది లేదన్నారు. లోకేష్ కు బెంజి అని కూడా సరిగా పలకడం చేతకాదన్నారు. ఆ కారు ఎవరి పేరు మీద ఉందో ఆరోపణలు చేసిన వారికైనా తెలుసా? అని మంత్రి జయరాం ప్రశ్నించారు. తాను ఎవరికీ బినామీ కాదని, తనకు ఎవరూ బినామీలు లేరని చెప్పారు.

Tags:    

Similar News