మంచి చేస్తే చప్పట్లు కొడతా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి విమర్శలకు దిగారు. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభోత్సవం చేసిన పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా [more]

Update: 2019-11-15 04:46 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి విమర్శలకు దిగారు. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభోత్సవం చేసిన పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు జరిగితే భవన నిర్మాణ కార్మికులు బతుకుతారన్నారు. అమరావతిలో రాజధాని కట్టకపోతే పులివెందుల్లో నిర్మిస్తామని తీర్మానం చేయమని వైసీపీ సర్కార్ కు పవన్ కల్యాణ‌్ సవాల్ విసిరారు. వైసీపీ సర్కార్ వన్నీ తప్పుడు విధానాలేనన్నారు. అవకాశవాదులే పార్టీ నుంచి వెళ్లిపోయారన్నారు. రాజకీయాల్లో నిలబడగలిగిన వాడే నేతగా మారుతాడని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్లనే ప్రజల్లోకి రావాల్సి వస్తుందన్నారు. ప్రజలకు మంచి చేస్తే చపట్లు కొడతానని, తాను శాపనార్థాలు పెడితే ఎందుకు భయమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News