జగన్ ను చూడగానే…?

గోదావరి బోటు ప్రమాద బాధితులను ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న జగన్ బాధితులతో మాట్లాడారు. అంతకు ముందు [more]

Update: 2019-09-16 06:13 GMT

గోదావరి బోటు ప్రమాద బాధితులను ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న జగన్ బాధితులతో మాట్లాడారు. అంతకు ముందు గోదావరి బోటు ప్రమాద ఘటనాస్థలిని సీఎం జగన్ విహాంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. సీఎంతో పాటు హోంశాఖ మంత్రి సుచరిత, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కూడా ఉన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సదుపాయంపై ఆరా తీశారు. అక్కడే ఉన్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఈ ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ వాసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ ను చూడగానే భాధితులు బోరున విలిపించారు. తమను ఆదుకోవాల్సిందిగా మృతుల కుటుంబ సభ్యులు జగన్ ను కోరారు.

 

 

 

Tags:    

Similar News