బ్రేకింగ్: టీడీపీ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

తెలుగుదేశం పార్టీ మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. బడా కంట్రాక్టర్ అయిన సుధాకర్ యాదవ్ ఇంట్లో సోదాలు [more]

Update: 2019-04-03 12:47 GMT

తెలుగుదేశం పార్టీ మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. బడా కంట్రాక్టర్ అయిన సుధాకర్ యాదవ్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణ జిల్లా కైకలూరులో చేపల వ్యాపారి బాలేశ్వరరావు ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇంట్లో భారీగా నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ దాడులు కక్ష సాధింపు చర్యలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ నేతలే లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరికొందరు టీడీపీ నేతలపై కూడా ఐటీ దాడులు జరుగుతాయని ఆ పార్టీ భావిస్తోంది.

Tags:    

Similar News