బ్రేకింగ్ : పెరుగుతున్న అసమ్మతి గళం

కాంగ్రెస్ లెజెస్లేచర్ పార్టీ నేత ఎంపిక కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకులు కె.సి.వేణుగోపాల్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో [more]

Update: 2019-01-17 04:40 GMT

కాంగ్రెస్ లెజెస్లేచర్ పార్టీ నేత ఎంపిక కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకులు కె.సి.వేణుగోపాల్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎల్బీనగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి తనకే సీఎల్పీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి కూడా ఇదే విషయాన్ని చెప్పాలన్నారు. కాంగ్రెస్ లో పనికిరాని వాళ్లు చాలా మంది ఉన్నారని, పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతలకంటే తానే సీనియర్ నని సుధీర్ రెడ్డి అన్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. మరి ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

Tags:    

Similar News