సైదిరెడ్డికే ……సై

హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరు ఖరారైంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఉత్తమ్ కుమార్  రెడ్డిపై సైదిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎలాగైనా [more]

Update: 2019-09-21 08:16 GMT

హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరు ఖరారైంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సైదిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎలాగైనా హుజూర్ నగర్ అసెంబ్లీ సీటును కైవసం చేసుకోవాలని కొంతకాలంగా టి.ఆర్.ఎస్ అక్కడ ప్రయత్నాలు చేస్తోంది. సైదిరెడ్డి సైతం చురుకుగా పనిచేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతికే టిక్కెట్ అని ప్రచారం జరిగినా ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంట్ర వర్సీ అయ్యింది. దీంతో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీచేస్తారనేది సస్పెన్స్ లో ఉంది. పద్మావతినే కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశాలున్నాయి.

 

Tags:    

Similar News