చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి ఉంటుంది.. హైకోర్టు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. నరేగా బిల్లులను చెల్లించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే చీఫ్ సెక్రటరీని న్యాయస్థానానికి [more]

Update: 2021-03-31 00:58 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. నరేగా బిల్లులను చెల్లించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే చీఫ్ సెక్రటరీని న్యాయస్థానానికి పిలవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. 2018 నుంచి 2019 వరకూ నరేగా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించపోవడంపై పిటీషన్ హైకోర్టులో దాఖలయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని ప్రభుత్వ తరుపున న్యాయవాది వివరించారు. దీనిపై రెండు వారాల్లోగా పూర్తి స్థాయి అఫడవిట్ ను దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది.

Tags:    

Similar News