జగన్ పై హర్ష హార్ష్ కామెంట్స్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులకు జగన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు [more]

Update: 2020-02-01 01:54 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులకు జగన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చారని హర్షకుమార్ ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందునే జగన్ సీబీఐ కేసులో ఇరుక్కోలేదని హర్షకుమార్ తెలిపారు. జగన్ తరుపున ఈరోజు కొండారెడ్డి అనే వ్యక్తి ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడని హర్షకుమార్ తెలిపారు. తండ్రి వైఎస్ పుణ్యమా అని జగన్ సీీబీఐ కేసుల నుంచి బయటపడ్డాడని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జగన్ ప్రమేయం లేకపోతే ఇన్నాళ్లు కేసుల్లో నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదని హర్షకుమార్ ప్రశ్నించారు. విశాఖను రాజధానిగా మారుస్తూ జగన్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని హర్షకుమార్ అభిప్రాయడపడ్డారు.

Tags:    

Similar News