హైదరాబాద్ లో కాల్పుల కలకలం

Update: 2018-08-02 08:26 GMT

హైదరాబాద్ లో ఓ భూవివాదం కాల్పుల దాకా వెళ్లింది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ బహదూర్ గూడలో ఇరువర్గాల మధ్య భూవివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. రెండువర్గాల మద్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఓ వర్గానికి చెందిన వ్యక్తి రివాల్వర్ తీసుకుని ఇతరులను బెదిరించాడు. గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించాడు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

Similar News