సాయిబాబా గుడికి వైసీపీ ఎమ్మెల్యే…. మళ్లీ టెన్షన్

విశాఖ సాయిబాబాగుడి వద్ద మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సవాల్ ను స్వీకరిస్తూ వైసీపీ [more]

Update: 2020-12-27 02:35 GMT

విశాఖ సాయిబాబాగుడి వద్ద మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సవాల్ ను స్వీకరిస్తూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ ఈరోజు ఉదయం 11గంటలకు సాయిబాబా గుడికి రానున్నారు. తాము వెలగపూడి రామకృష్ణపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ప్రమాణం చేస్తామని అమర్ నాధ్ తెలిపారు. తాను ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ అక్కడ వెలగపూడి కోసం వెయిట్ చేస్తామని చెప్పారు. విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడలేదని సాయిబాబా సాక్షిగా వెలగపూడి ప్రమాణం చేయగలరా? అని అమర్ నాధ్ ప్రశ్నించారు. వెలగపూడి స్థాయికి ఎంపీ విజయసాయిరెడ్డి అవసరం లేదని ఆయన తెలిపారు.

Tags:    

Similar News