శ్రీలక్ష్మికి పదోన్నతి.. కేంద్రం అనుమతించాకే

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న వై. శ్రీలక్ష్మి, జి. సాయిప్రసాద్, అజయ్ జైన్, [more]

Update: 2021-03-09 01:11 GMT

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న వై. శ్రీలక్ష్మి, జి. సాయిప్రసాద్, అజయ్ జైన్, ఆర్ఎస్ సిసోడియా, సుమితా దావ్రాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే శ్రీలక్ష్మికి శాశ్వతంగా పదోన్నతి లభిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News