భోగి మంటల్లో కమిటీ…?

జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెంట్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో [more]

Update: 2020-01-14 02:30 GMT

జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెంట్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తమ నిరసనను తెలియజేశారు. అమరావతిని రాజధానిగానే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు ప్రాంతంలోని రైతులు ఉదయాన్నే భోగి మంటల్లో కమిటీ రిపోర్టులు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంజిసర్కిల్ లో జరిగిన కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అమరావతిని చీలిస్తే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags:    

Similar News