మళ్లీ గంటా డుమ్మా…టీడీపీలో హాట్ టాపిక్

విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు భారీ గా స్వాగతం పలికారు. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం గైర్హాజరయ్యారు. టీడీపీ [more]

Update: 2021-01-02 07:22 GMT

విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు భారీ గా స్వాగతం పలికారు. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం గైర్హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు చిన రాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అయితే గంటా శ్రీనివాసరావు విశాఖ ఎయిర్ పోర్టుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకున్నప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు రాలేదు.

Tags:    

Similar News