రేపు జగన్ వద్దకు గంటా శ్రీనివాసరావు

గంటా శ్రీనివాసరావు రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవనున్నారు. ఆయన అధికారికంగా పార్టీలో చేరకపోయినా గంటా కుమారుడు రవితేజ వైసీపీలో చేరబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గంటా [more]

Update: 2020-10-02 02:13 GMT

గంటా శ్రీనివాసరావు రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవనున్నారు. ఆయన అధికారికంగా పార్టీలో చేరకపోయినా గంటా కుమారుడు రవితేజ వైసీపీలో చేరబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉండటంతో జగన్ ఆయన కుమారుడికి వైసీపీ కండువా కప్పనున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా తన కుమారులకు కండువా కప్పించారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిిస్తున్నాయి. విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలపడంతో ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తుంది.

Tags:    

Similar News