బ్రేకింగ్ : నలుగురు ఎమ్మెల్సీలు?

టీడీపీ శాసనసభ పక్ష సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. మండలిలో 32 మంది టీడీపీ సభ్యులున్నారు. అయితే సరస్వతి, ప్రభాకర్, తప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు దూరంగా ఉన్నారు. [more]

Update: 2020-01-26 06:03 GMT

టీడీపీ శాసనసభ పక్ష సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. మండలిలో 32 మంది టీడీపీ సభ్యులున్నారు. అయితే సరస్వతి, ప్రభాకర్, తప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో తాము సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, పోతుల సునీత, శివానాధ్ రెడ్డిలు పార్టీ వ్యతిరేక లైన్ తీసుకున్నారు. శమంతకమణి తాను అనారోగ్యంతో హాజరుకాలేనని సమాచారం పంపారు. ఇటీవల జరిగిన మండలి సమావేశాలకు కూడా శమంతకమణి హాజరు కాలేదు. టీడీఎల్పీ సమావేశంలో రేపు శాసనమండలి రద్దు అంశాన్ని చర్చించాలని నిర్ణయించారు. ఇప్పటికే టీడీపీ తమ ఎమ్మెల్సీలను వైసీపీ ప్రలోభాలకు గురిచేస్తుందని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News