బ్రేకింగ్ : రేపే బలపరీక్ష…. గవర్నర్ నిర్ణయం

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్ నాధ్ ప్రభుత్వానికి రేపు బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో [more]

Update: 2020-03-15 04:31 GMT

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్ నాధ్ ప్రభుత్వానికి రేపు బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో రేపు బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశించారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారంతా క్యాంపుల్లో ఉన్నారు. మరోవైపు స్పీకర్ కూడా ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కమల్ నాధ్ ప్రభుత్వం బలపరీక్షలో గట్టెక్కడం కష్టమే.

Tags:    

Similar News