మరోసారి గంటా

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విశాఖ అడ్మినిస్ట్రేటవ్ రాజధాని పై స్పందించారు. విశాఖ నగరాన్ని రాజధానిగా చేయాలని ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారన్నారు. తమ అధినేత చంద్రబాబు [more]

Update: 2019-12-20 06:43 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విశాఖ అడ్మినిస్ట్రేటవ్ రాజధాని పై స్పందించారు. విశాఖ నగరాన్ని రాజధానిగా చేయాలని ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారన్నారు. తమ అధినేత చంద్రబాబు నిర్ణయం, పార్టీ స్టాండ్ ఎలా ఉన్నా తాను మాత్రం విశాఖ రాజధాని ప్రతిపాదనను స్వాగతిస్తానని తెలిపారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు కొంత బాధపడుతుండవచ్చునని, తాను మాత్రం విశాఖతో ఉన్న అనుబంధం కారణంగా సమర్థించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. చంద్రబాబు ఏమి అనుకున్నా తన మనసులో మాట చెప్పేందుకు వెనకాడబోనని గంటా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలున్నా తన స్టాండ్ మాత్రం అదేనని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Tags:    

Similar News