రేపు బీజేపీలో చేరనున్న ఈటల

రేపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈటల రాజేందర్ తో పాటు [more]

Update: 2021-06-13 04:21 GMT

రేపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈటల రాజేందర్ తో పాటు మరికొందరు నేతలు కూడా రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానాన్ని ఇందుకోసం బుక్ చేసినట్లు తెలిసింది. ముఖ్యనేతలు, అనుచరులు వంద మందితో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, స్పీకర్ దాని ఆమోదించడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Tags:    

Similar News