బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరుతున్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన చేరనున్నారు. ఈటల [more]

Update: 2021-06-11 04:31 GMT

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరుతున్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన చేరనున్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. నేడో,రేపో స్పీకర్ కు తన రాజీనామా లేఖను ఈటల రాజేందర్ అందజేసే అవకాశముంది. బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు.

Tags:    

Similar News