ప్ర‌శాంతంగా ముగిసిన పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. తెలంగాణ‌లో మొద‌టి విడ‌త ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఇవాళ జ‌రిగింది. [more]

Update: 2019-05-06 12:52 GMT

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. తెలంగాణ‌లో మొద‌టి విడ‌త ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఇవాళ జ‌రిగింది. గుంటూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జ‌ర‌గ‌గా సుమారు 75 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైంది. తెలంగాణ‌లోనూ స్థానిక సంస్థల ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రిగాయి. 195 జెడ్పీటీసీ, 2096 ఎంపీటీసీ స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. ఖ‌మ్మంలో ఓ పోలింగ్ బూత్ లో ఓటేస్తుండ‌గా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం, యాదాద్రి జిల్లాలో ఓ పోలింగ్ స్టేష‌న్ లో బ్యాల‌ట్ ప‌త్రాలు తారుమారు కావ‌డం మిన‌హా మిగ‌తా చోట్ల పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది.

Tags:    

Similar News