ఆయ‌న వైఎస్ కు ఆత్మ‌.. కేసీఆర్ కు ఆత్మ‌బంధువు

కేవీపీ రామ‌చంద్ర‌రావు, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పోల‌వ‌రం ఆపేందుకు కేసీఆర్‌, జ‌గ‌న్ ఆదేశాల‌తో కుట్ర చేస్తున్నార‌ని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పోల‌వ‌రం [more]

Update: 2019-05-08 06:35 GMT

కేవీపీ రామ‌చంద్ర‌రావు, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పోల‌వ‌రం ఆపేందుకు కేసీఆర్‌, జ‌గ‌న్ ఆదేశాల‌తో కుట్ర చేస్తున్నార‌ని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేవీపీ, ఉండ‌వ‌ల్లి చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కేవీపీ వైఎస్ఆర్ కు ఆత్మ అని, కేసీఆర్ కు ఆత్మ‌బంధువు అని పేర్కొన్నారు. కేసీఆర్‌, క‌విత పోల‌వ‌రం ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా కేసులు వేస్తున్నార‌ని ఆరోపించారు. అయినా కూడా కేసీఆర్ ఇచ్చే కాసుల కోసం ఆశ‌ప‌డి జ‌గ‌న్ నోరు మెద‌ప‌డం లేద‌న్నారు. కొంత‌మంది పోల‌వ‌రంపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అటువంటి వారికి వైసీపీపై ప్రేమ ఉంటే వైసీపీలో చేరాలి కానీ ప్ర‌జ‌ల‌ను మాత్రం ప‌క్క‌దారి ప‌ట్టించ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే రాజ‌మండ్రిలో ఉండ‌వ‌ల్లి, ఢిల్లీలో కేవీపీ డ్రామాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు. ఈ నెల 23 త‌ర్వాత వైసీపీ దుకాణం బంద్ అవుతుంద‌ని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News