బ్రేకింగ్ : టీడీపీకి ఊహించని దెబ్బ

తెలుగుదేశం పార్టీ కి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పానున్నారు. రేపు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, ఎం.పి విజయసాయిరెడ్డి తో దేవినేని [more]

Update: 2019-10-19 15:23 GMT

తెలుగుదేశం పార్టీ కి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పానున్నారు. రేపు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, ఎం.పి విజయసాయిరెడ్డి తో దేవినేని అవినాష్ భేటి కానున్నారు. ఈ నెల _23 వ తేదీన వైసీపీ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలకు దేవినేని అవినాష్ సంకేతాలు ఇచ్చారు. తెలుగుదేశం నుంచి తన భవిష్యత్ పై ఎటువంటి భరోసా లభించకపోవడం, తనను నమ్ముకున్న క్యాడర్ ను కాపాడుకోవటం కోసమే దేవినేని అవినాష్ పార్టీ మారుతునట్లు సమాచారం. వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలతో పాటు అసెంబ్లీ సీటు పై హామీ ఇచ్చి దేవినేని అవినాష్ కు టీడీపీనేతలు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News