కరోనా కట్డడి అవుతోంది.. 11 జిల్లాలు వైరస్ రహితంగా

తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. నిన్న కేవలం ఏడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల [more]

Update: 2020-04-30 05:01 GMT

తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. నిన్న కేవలం ఏడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. కొత్తగా నమోదయిన ఏడు కేసులు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనివే. ఇక తెలంగాణలోని 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా అధికారులు ప్రకటించారు. మహబూబాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట, నారాయణ్ పేట్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు ములుగు జిల్లాల్లో చికిత్స పొంది నెగిటివ్ రావడంతో కరోనా రహిత జిల్లాలుగా పేర్కొన్నారు. అలాగే వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Tags:    

Similar News