బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కేసులు.. పెరిగిన మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 765 మందికి కరోనా సోకింది. గడచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 727 మందికి [more]

Update: 2020-07-04 08:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 765 మందికి కరోనా సోకింది. గడచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 727 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా సోకింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,699కు చేరుకుంది. 24 గంటల్లో 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 9473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని
8008 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News