భారత్ లో విజృంభిస్తున్న కరోనా

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ఇండియాలో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 149 కేసులు నమోదయ్యాయి. ఇది ఆందోళన [more]

Update: 2020-03-28 06:50 GMT

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ఇండియాలో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 149 కేసులు నమోదయ్యాయి. ఇది ఆందోళన కల్గించే అంశమేనంటున్నారు నిపుణులు. గత ఆరు రోజుల నుంచి భారత్ లో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ సమయంలోనూ ప్రజలు బయటకు వస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయంటున్నారు. విదేశాల నుంచి గత జనవరి నుంచి దాదాపు 15 లక్షల మంది ఇండియాకు చేరుకోవడంతో వారికి కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకింది. వారినుంచి ఇతరులకు సోకకుండా లాక్ డౌన్ ప్రకటించినా కూడా కేసులు పెరుగుతున్నాయి.

Tags:    

Similar News