ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన వారిలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన కల్గిస్తుంది. ఇటీవల హైదరాబాద్ [more]

Update: 2020-05-30 04:15 GMT

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన వారిలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన కల్గిస్తుంది. ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో సచివాలయ ఉద్యోగులు వచ్చారు. వారందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. అయితే వారిలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ఉద్యోగితో రెండు రోజులుగా కలసి తిరిగిన ఉద్యోగలందరినీ సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ఈ బస్సు బయలుదేరింది. ఈ వివరాలను సచివాలయ ఉద్యోగల సంఘం వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు తెలియజేశారు.

Similar News