బ్రేకింగ్ : భారత్ లో విజృంభిస్తున్న కరోనా… 23వేలకు చేరుకున్న?

భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ దేశ [more]

Update: 2020-04-24 03:43 GMT

భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 23,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 17,610 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 718కి చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో 6,420 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 1,683కేసులు కాగా, ఒక్క చెన్నై నగరంలోనే 400 కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా వ్యాధి సోకి కోలుకున్న వారి సంఖ్య 4,328 మంది ఉన్నారు. రోజుకు 700 మంది వరకూ కరోనా నుంచి కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News