కర్నూలులో ఆగడం లేదే… రోజురోజుకూ పెరగడమే తప్ప?

కర్నూలు జిల్లాలో కరోనా ఆగడం లేదు. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో అత్యధిక శాతం కర్నూలు జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 292 కేసులు నమోదయ్యాయి. 9 [more]

Update: 2020-04-28 02:45 GMT

కర్నూలు జిల్లాలో కరోనా ఆగడం లేదు. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో అత్యధిక శాతం కర్నూలు జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 292 కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడే వైద్యులకు కూడా అత్యధిక సంఖ్యలో కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. కర్నూలు, నంద్యాల పట్టణాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కర్నూలులో కంట్రోల్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గినట్లేనన్నది అధికారుల అంచనా.

Tags:    

Similar News