కేసీఆర్ తో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

కాంగ్రెస్, టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ప్రగతి [more]

Update: 2019-03-13 13:41 GMT

కాంగ్రెస్, టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ప్రగతి భవన్ లో తన కుమారులతో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆమె ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. చేవెళ్లలో బహిరంగ సభ ఏర్పాటు చేసి సబితా, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆమెకు మంత్రి పదవి లేదా కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ టిక్కెట్ దక్కనుంది. ఇక, ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా కేసీఆర్ ను కలిశారు. వారు కూడా పార్టీ మారనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Tags:    

Similar News