మరికొందరు కాంగ్రెస్ నేతలతో బీజేపీ చర్చలు

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి డీకే [more]

Update: 2019-03-20 12:55 GMT

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరగా మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, నారాయణపేట కాంగ్రెస్ నేత శివకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సునీతా లక్ష్మారెడ్డితో టీఆర్ఎస్ నేతలు కూడా చర్చలు జరుపుతున్నారు. దీంతో ఏ పార్టీలో చేరాలనేది ఆమె ఇంకా నిర్ణయించుకోలేదు.

Tags:    

Similar News