ఇంటర్ బాలిక గ్యాంగ్ రేప్

ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. పదకొండో (ఇంటర్) క్లాస్ చదువుతున్న ఓ బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. సోమవారం యూపీలో షహారన్పూర్ కి చెందిన ఓ బాలిక స్కూల్ నుంచి వస్తున్న సమయంలో ఆమెకు తెలిసిన ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చి ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికారు.

Update: 2023-09-13 03:54 GMT

ఐదుగురు యువకుల అఘాయిత్యం  

ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. పదకొండో (ఇంటర్) క్లాస్ చదువుతున్న ఓ బాలికపై  ఐదుగురు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. సోమవారం యూపీలో షహారన్పూర్ కి   చెందిన ఓ బాలిక స్కూల్ నుంచి వస్తున్న సమయంలో ఆమెకు తెలిసిన ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చి ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికారు. ఆమె బైక్ ఎక్కడంతో, ఓ నిర్మానుష్య  ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ మరో ముగ్గురి యువకులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

అనంతరం ఆమెను ఇంటికి సమీపంలో వదిలేసి ఇద్దరు యువకులు వెళ్లిపోయారు. ఆమె కష్టంమీద దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి చేరుకొని తనపై జరిగిన ఘోరం గురించి వాళ్లకి చెప్పింది. పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకి విషయం తెలియజేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారు. అనంతరం వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆ బాలికని మీరట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం చేసిన ఐదుగురు యువకులు.. అంకుర్, అమన్, సావేజ్, సర్వేజ్, సాదిక్ లను మంగళవారం అరెస్ట్ చేసినట్లు గంగోవా ఏఎస్పీ సాగర్ జైన్ తెలిపారు. పోక్సో చట్టం కింద వారిపై కేసు పెట్టి కోర్టులో హాజరు పరచినట్లు ఆయన వెల్లడించారు. 


Tags:    

Similar News