చింతమనేని వ్యాఖ్యలతో కలకలం

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడంతో [more]

Update: 2021-03-04 00:50 GMT

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడంతో తాను ఇక్కడ బీజేపీ, జనసేన తరుపున ప్రచారం చేస్తానని చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బలవంతంగా భయపెట్టి, బెదిరించి నామినేషన్లు విత్ డ్రా చేయించిన చోట బీజేపీ, జనసేనలకు టీడీపీ నేతలు మద్దతు ఇవ్వాలన్న చర్చ మొదలయింది. పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్ ఉండదని, నమ్ముకున్న వారికి పార్టీ అండగా ఉండాలని చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News