మరికాసేపట్లో యడ్యూరప్ప

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరికాసేపట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కొననున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. బెంగళూరులోని ఒక హోటల్ లో [more]

Update: 2019-07-29 05:07 GMT

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరికాసేపట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కొననున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. బెంగళూరులోని ఒక హోటల్ లో ఉంచిన బీజేపీ ఎమ్మెల్యేలను నేరుగా విధానసభకు తీసుకురానున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు 17 మంది పై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గడం సులువుగా మారింది. బీజేపీకి 105 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉండటంతో యడ్యూరప్ప ఈజీగా విశ్వాస పరీక్షను గట్టెక్కే అవకాశాలున్నాయి. ఇప్పటికే యడ్యూరప్ప విధానసభకు చేరుకున్నారు.

Tags:    

Similar News