చంద్రగిరిలో మళ్లీ లొల్లి… నానిని అడ్డుకున్న వైసీపీ

చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ బూత్ లలో రేపు రీపోలింగ్ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రీపోలింగ్ జరుగుతున్న గ్రామాల్లోకి వెళ్లిన అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీ వారు, [more]

Update: 2019-05-18 11:45 GMT

చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ బూత్ లలో రేపు రీపోలింగ్ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రీపోలింగ్ జరుగుతున్న గ్రామాల్లోకి వెళ్లిన అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీ వారు, గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. మొన్న రాత్రి తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని టీడీపీ వర్గీయులు అడ్డుకోగా ఇవాళ వైసీపీకి పట్టున్న కుప్పంబాదురు గ్రామానికి ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని వైసీపీ నేతలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో పులివర్తి నాని అక్కడే కూర్చుని ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని ఎటువంటి గొడవలు కాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News