లోక్ సభలో జరుగుతున్న పరిణామాలను గమనించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు సరికొత్త వ్యూహాన్ని రచించింది. రేపు లోక్ సభ వాయిదా పడిన వెంటనే సభలోనే రాత్రంతా ఉండాలని నిర్ణయించారు. రాత్రంతా సభలోనే ఉండి తమ నిరసనలు తెలియజేయాలని ఎంపీలకు ఆదేశించారు. కేంద్రంపై వత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సభ వాయిదా పడినా రేపు రాత్రంతా లోక సభలోనే ఉండాలని చంద్రబాబు ఎంపీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.