గవర్నర్ వద్దకు చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. టీడీపీ నేతలపై నమోదవుతున్న తప్పుడు కేసుల విషయాన్ని చంద్రబాబు గవర్నర్ దృష్టికి తేనున్నారు. [more]

Update: 2019-09-19 02:41 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. టీడీపీ నేతలపై నమోదవుతున్న తప్పుడు కేసుల విషయాన్ని చంద్రబాబు గవర్నర్ దృష్టికి తేనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు చంద్రబాబు గవర్నర్ ను కలుస్తారు. సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య, ఆయనపై పెట్టిన కేసులను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని చంద్రబాబు గవర్నర్ ను కోరనున్నారు. దీంతోపాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు కేసుల విషయాన్ని కూడా చంద్రబాబు గవర్నర్ కు వివరించనున్నారు.

Tags:    

Similar News