మళ్లీ నన్నే కోరుకుంటున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరెండర్ పాలిటిక్స్ చేస్తుందని టీడీపీ అధినేేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతల ఆర్థికమూలాలను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులను నమోదు చేస్తుందని తెలిపారు. [more]

Update: 2019-10-30 05:04 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరెండర్ పాలిటిక్స్ చేస్తుందని టీడీపీ అధినేేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతల ఆర్థికమూలాలను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులను నమోదు చేస్తుందని తెలిపారు. వైసీపీ వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. ఇప్పుడు ఏపీ ప్రజలు తననే కోరుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. జగన్ ప్రభుత్వానికి ఎందుకు అవకాశమిచ్చామా? అని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా కట్టడి చేసేందుకే వైసీపీ టీడీపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తుందన్నారు. వల్లభనేని వంశీ విషయంలో ఇదే జరిగిందన్నారు. కార్యకర్తలకు, నేతలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఐదునెలల జగన్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News