ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలిపివేయాలని చంద్రబాబు కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ [more]

Update: 2021-02-21 01:40 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలిపివేయాలని చంద్రబాబు కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా బలోపేతం చేయాలని లేఖలో తెలిపారు. ప్రయివేటీకరణ అంశాన్ని తక్షణం నిలిపివేసి, ఏపీ ప్రజల సెంటిమెంట్ ను కాపాడాలని చంద్రబాబు ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు. ఏపీ ప్రజలు ఈ ఉక్కు కర్మాగారాన్ని తమ సెంటిమెంట్ గా భావిస్తున్నారన్నారు. ప్రయివేటీకరణ ఆలోచన మానుకుని, తెలుగు ప్రజల సెంటిమెంట్ ను కాపాడాలని చంద్రబాబు తన లేఖలో ప్రధానిని కోరారు.

Tags:    

Similar News