ఎన్నికల కమిషన్ వేస్ట్.. ఈ ఎన్నికలు ఎందుకు?

కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విచ్చలవిడిగా వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేశారన్నారు. తాము గెలవకపోవడం కాదని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చంద్రబాబు [more]

Update: 2021-02-19 00:54 GMT

కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విచ్చలవిడిగా వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేశారన్నారు. తాము గెలవకపోవడం కాదని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చంద్రబాబు తెలిపారు. పూర్తి ఆధారాలను ఎన్నికల కమిషన్ కు పంపినా చర్యలు తీసుకోలేదని అన్నారు. అక్రమాలు అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ మంది టీడీపీ మద్దతు దారులే విజయం సాధించారన్నారు చంద్రబాబు. కుప్పంతో తనకు 35 ఏళ్ల అనుభవముందని, అక్కడి ప్రజలు తనను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తారని, అక్కడ ఓడిపోయామంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News