ప్రజలు వ్యతిరేకంగా ఉన్న వైసీపీకి బుద్ధిరావడం లేదు

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వ్యతిరేక తీర్పు చెప్పారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అయినా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. అక్రమ అరెస్ట్ [more]

Update: 2021-02-16 00:51 GMT

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వ్యతిరేక తీర్పు చెప్పారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అయినా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. అక్రమ అరెస్ట్ లు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేతలు ఖూనీ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నేతలు రావణ కాష్టంగా మార్చారని అన్నారు. టీడీపీకి ప్రజాబలం పెరుగుతుండటంతో వైసీపీ ఓర్వలేకపోతుందని చంద్రబాబు అన్నారు. అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పులివెందులలో టీడీపీ కార్యకర్తకు చెందిన పంటపొలాలను నాశనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News