నా మనసంతా అక్కడే ఉంది.. కానీ?

తాను హైదరాబాద్ లో ఉన్నా మనసంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. లాక్ డౌన్ విధించడంతోనే తాను హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. [more]

Update: 2020-03-31 12:39 GMT

తాను హైదరాబాద్ లో ఉన్నా మనసంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. లాక్ డౌన్ విధించడంతోనే తాను హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. హుద్ హుద్, తిత్లీ తుపాను లను తాను డీల్ చేశానని చెప్పారు. ఇప్పుడు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఆంక్షల వల్ల తాను బయటకు రాలేకపోతున్నానని చంద్రబాబు తెలిపారు. తాను హైదరాబాద్ లో ఉన్నా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ కరోనా పనిమీదనే ఉన్నానని చంద్రబాబు చెప్పారు. తాను కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నానని చెప్పారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నానని చెప్పారు. తొలిసారిగా స్పందించింది తానేనని, ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షలు ఇచ్చానని తెలిపారు.

Tags:    

Similar News