ఐదు కోట్ల మంది ఆగ్రహంతో ఉన్నారు

అమరావతి పరిరక్షణ అందరి సంకల్పం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఐదుకోట్ల ప్రజలు, ముఖ్యంగా యువత తమ ఉపాధి అవకాశాల కోసం అమరావతిని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. [more]

Update: 2020-01-01 05:46 GMT

అమరావతి పరిరక్షణ అందరి సంకల్పం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఐదుకోట్ల ప్రజలు, ముఖ్యంగా యువత తమ ఉపాధి అవకాశాల కోసం అమరావతిని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పార్టీ నేతలతో పాటు పలువురు జేఏసీకి విరాళాలు ఇవ్వడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధానిని మార్చడం పట్ల ఐదు కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా జగన్ తన ఆలోచనను మానుకోవాలని పిలుపునిచ్చారు. దుర్గమ్మ గుడి నుంచి నేరుగా చంద్రబాబు అమరావతి ప్రాంతంలో రైతుల వద్దకు వెళ్లారు. వారితో పాటు ఆందోళనల్లో పాల్గొననున్నారు.

Tags:    

Similar News